న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత ఆదివారం ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. దీంతో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది.
మరోవైపు మనీశ్ సిసోడియా ఐదు రోజుల సీబీఐ కస్టడీ శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.