న్యూఢిల్లీ, జూన్ 5: మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను సోమవారం కోర్టు తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉండటంతో, ఆరు వారాలు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా హైకోర్టును ఆశ్రయించారు.