న్యూఢిల్లీ, ఆగస్టు 16: మణిపూర్ హింసను నివారించడంలో విఫలమైన సీఎం బీరేన్సింగ్ను పదవి నుంచి తొలగించాలని ఐద్వా (ఆల్ ఇండియా వుమెన్స్ అసోసియేషన్) డిమాండ్ చేసింది. మణిపూర్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇటీవల ఐద్వా బృందం ఆ రాష్ట్రంలో పర్యటించింది.ఐద్వా సభ్యురాలు, సీపీఎం నేత బృందాకారత్ బుధవారం మీడియాతో మాట్లాడారు. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని సీపీఎం నాయకురాలు బృందాకారత్ ఆరోపించారు. హింస కారణంగా మణిపూర్ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిందని ఆందోళన వ్యక్తం చేశారు.