న్యూఢిల్లీ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శిస్తూ తాను గాంధేయవాదినే కాని రాహుల్వాదిని కానని అయ్యర్ వ్యాఖ్యానించారు.
తాను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలేదని, ఒకవేళ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తనను బయటకు తరిమేస్తే తాను సంతోషంగా బయటకు వెళ్లి ఆయనను వెనుక నుంచి తంతానంటూ అయ్యర్ వ్యాఖ్యానించారు. గాంధీపై నెహ్రూ తిరుగుబాటు చేశారని, అయినప్పటికీ గాంధీ నెహ్రూను ప్రధానిగా ఎంపిక చేశారని అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.