న్యూఢిల్లీ : (Maneka and Varun) బీజేపీ విధానాలను గత కొన్ని రోజులుగా విమర్శిస్తున్న వరుణ్గాంధీకి బీజేపీ షాకిచ్చింది. వరుణ్గాంధీతో పాటు ఆయన తల్లి మేనకాగాంధీలను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారు. 80 మందితో కూడిన జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం విడుదల చేశారు. ఈ జాబితాలో వరుణ్గాంధీ, మేనకాగాంధీలకు చోటు లేకుండాపోయింది. సుల్తాన్పూర్ నుంచి లోకసభ ఎంపీగా మేనకగాంధీ, ఫిల్భిత్ను నుంచి ఆమె కుమారుడు వరుణ్గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి ప్రముఖులతోపాటు కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, అశ్విని వైష్ణవ్, కేంద్ర మాజీ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకావ్ జావదేకర్, వివిధ రాష్ట్రాల నాయకుల పేర్లకు చోటుదక్కింది.
జేపీ నడ్డా విడుదల చేసిన 80 మంది సాధారణ సభ్యులతో పాటు మరో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు కూడా ఉంటారు. జాతీయ కార్యవర్గం పార్టీకి కీలకమైనది. ఇది ప్రభుత్వం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చించడానికి, సంస్థ ఎజెండాను రూపొందించడంలో కృషిచేస్తుంది. కొవిడ్-19 మహమ్మారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం చాలా కాలం పాటు జరుగలేదు. గత జాతీయ కార్యవర్గ సమావేశం 2019 జనవరిలో జరిగింది.
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి : వెంకయ్యనాయుడు
మలేరియా వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం
సంపాదనలో 10 వ వంతు దానం చేయమన్న గురు గోవింద్ సింగ్
జెరూసలెంలో 2,700 ఏండ్ల క్రితం టాయిలెట్ లభ్యం
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సంక్షోభం తప్పదు : యూఎన్ హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..