న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత పడిపోతున్నది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఎన్సీఆర్లో చర్యలకు ఉపక్రమించడంతో పాటు ప్రజలకు కీలక సూచనలు చేసింది. వీలైనంత వరకు ఉద్యోగాలు ఇంటి నుంచి పని చేయాలని, వాయు కాలుష్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఈ సీజన్లో తొలిసారిగా గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన సేవలు మినహా అన్ని విభాగాల్లో నిర్మాణ పనులు నిషేధించారు. ప్రజలు రవాణా కోసం షేరింగ్ వాహనాలను ఉపయోగించాలని కమిషన్ విజ్ఞప్తి చేసింది. సైకిల్స్ను వినియోగించాలని, వీలైనంత వరకు ఇంట్లో నుంచి పని చేసుకోవాలని కోరింది. ఎంపిక చేసిన విభాగాలు మినహా మొత్తం ఎన్సీఆర్లో నిర్మాణ పనులపై కమిషన్ కఠినమైన ఆంక్షలు విధించింది. రైల్వే స్టేషన్లు, మెట్రో, ఆసుపత్రులు, విమానాశ్రయాలు తదితర విభాగాలు మినహా మిగతా వాటిపై నిషేధం విధించింది.