Bihar | ఓ ప్రయాణికుడు రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆగి ఉన్న రైలు కింద నుంచి పట్టాలను దాటేందుకు యత్నించాడు. అంతలోనే రైలు కదలడంతో.. చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ భాగల్పూర్లోని కహల్ గావ్ రైల్వే స్టేషన్ అది. ఓ రైలు స్టేషన్లో ఆగి ఉంది. దీంతో ఓ ప్రయాణికుడు ఆగి ఉన్న రైలు కింద నుంచి పట్టాలను దాటేందుకు యత్నించాడు. కానీ క్షణాల్లోనే రైలు వేగంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలో ఆందోళనకు గురైన ప్రయాణికుడు.. పట్టాలను దాటలేదు. తెలివిగా పట్టాలపైనే బొక్కబొర్లా పడుకున్నాడు. ఇక రైలు వెళ్లిపోయిన తర్వాత లేచి అటునుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అతను ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
बच गया रे भाई! वीडियो देखकर शॉर्टकट मारना भूल जाइएगा. शख्स एक नंबर से दूसरे नंबर प्लेटफॉर्म पर मालगाड़ी के नीचे से निकलने ही वाला था तभी गाड़ी चल पड़ी. शख्स तो बाल-बाल बच गया लेकिन शॉर्टकट के चक्कर में जान भी जा सकती थी. वीडियो- कहलगांव स्टेशन का है. #Bihar #Bhagalpur #BREAKING pic.twitter.com/VVP4WCzwZv
— Aapna Bihar (@Aapna__Bihar) November 10, 2022