లక్నో: ఒకరితో వ్యక్తిగత విరోధం నేపథ్యంలో ముగ్గురు పిల్లలను కారుతో తొక్కి చంపేందుకు (Man Tries To Crush Three Children Under Car) ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తు ఆ పిల్లలు గాయాలతో బయటపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. వీరేంద్ర అలియాస్ సీతారాం, మలిహాబాద్ ప్రాంతంలోని కాజీ ఖేడాలో నివసిస్తున్నాడు. అతడికి గోవింద్ అనే వ్యక్తితో శతృత్వం ఉంది. ఈ నేపథ్యంలో వీరేంద్ర ముగ్గురు పిల్లలను చంపేందుకు గోవింద్ ప్రయత్నించాడు.
ఈ నెల 13న వీరేంద్ర ముగ్గురు పిల్లలైన 8 ఏళ్ల శివాని, నాలుగేళ్ల స్నేహ, మూడేళ్ల కృష్ణ సమీపంలోని మార్కెట్కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంతలో కారు డ్రైవ్ చేస్తూ అటుగా వచ్చిన గోవింద్, ఈ ముగ్గురు పిల్లలను చూశాడు. కారును వారి మీదకు దూకించాడు. కారు చక్రాల కింద వారిని నలిపి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తు అక్కడ అడ్డుగా కొన్ని కర్రలు ఉండటంతో ఆ పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు.
కాగా, పిల్లలపైకి కారు దూసుకెళ్లడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పరుగున వెళ్లారు. నిందితుడు గోవింద్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన పిల్లలను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరేంద్రతో విరోధం వల్ల అతడి ముగ్గురు పిల్లలను కారుతో ఢీకొట్టి తొక్కి చంపేందుకు గోవింద్ ప్రయత్నించినట్లు పోలీసులు ఆరోపించారు. పిల్లల తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి నిందితుడిపై మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Lucknow: In an incident captured in CCTV in Malihabad Kazikheda village, car driver Govind tried to take revenge of enmity with Virendra by ramming his 3 innocent children, the children were seriously injured, the accused arrested.#UttarPradesh pic.twitter.com/1rygNuBpAQ
— Siraj Noorani (@sirajnoorani) July 18, 2023