చండీగఢ్: కాంగ్రెస్ నాయకుడు, పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు ముందు ఒక వ్యక్తి ఆయనతో సెల్ఫీ దిగాడు. దీంతో ఆయన హత్యలో అతడి పాత్రపై పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భద్రతను ఉపసంహరించిన మరునాడైన మే 29న మాన్సా జిల్లాలోని సొంత గ్రామంలో వాహనంపై వెళ్తున్న సిద్ధూపై కొందరు తుపాకులతో కాల్పులు జరిపి హత్య చేశారు. పంజాబ్లో కలకలం రేపిన ఈ సంఘటన ఆ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఆప్ ప్రభుత్వాన్ని కుదిపేసింది.
దీంతో ప్రభుత్వం ఆదేశంలో పంజాబ్ పోలీసులు సిద్ధూ హత్య కేసు దర్యాప్తుపై సీరియస్గా దృష్టి సారించారు. మే 29 సాయంత్రం సిద్ధూ హత్యకు ముందు సీసీటీవీలో రికార్డైన ఒక వీడియో క్లిప్ను పరిశీలించారు. కొందరు వ్యక్తులు సిద్ధూ వాహనాన్ని ఆపినట్లు అందులో ఉంది. ఒక వ్యక్తి ఆయనతో సెల్ఫీ దిగాడు. ఆ గ్రూప్లోని ఇద్దరు అనంతరం షూటర్లకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, సిద్ధూ వాహనం వద్ద ఉన్న ఒక వ్యక్తిని కేకడగా పోలీసులు గుర్తించారు. అభిమానిగా చెప్పుకున్న అతడు సిద్ధూ ఇంటి వద్ద సుమారు 40 నిమిషాలు ఉండి రెక్కీ నిర్వహించినట్లు గ్రహించారు. సిద్ధూ ఎలాంటి సెక్యూరిటీ, గన్మెన్లు లేకుండా బుల్లెట్ ఫ్రూఫ్ రహిత వాహనంలో ప్రయాణిస్తున్నట్లు షూటర్లకు అతడు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో సిద్ధూ హత్యలో కేకడ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు సంబంధించి ఎనిమిది మంది షూటర్లను పంజాబ్ పోలీసులు గుర్తించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రకు చెందిన వీరిని అరెస్ట్ చేసేందుకు ఆయా ప్రాంతాలకు పోలీస్ బృందాలను పంపారు.
Watch | CCTV footage shows men taking selfies with Sidhu Moose Wala minutes before the singer was shot dead
One person has been identified. As per sources, he conducted the recce of Moose Wala and informed other shooters.
Read full report https://t.co/oWTsKeO2sM pic.twitter.com/4LQOyP9KeP
— Hindustan Times (@htTweets) June 6, 2022