Ayodhya | అయోధ్య : అయోధ్యలో సోమవారం వైభవోపేతంగా నిర్వహించిన రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి రామ భక్తులు హాజరయ్యారు. అయితే రామకృష్ణ శ్రీవాత్సవ(65) అనే భక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. టెంపుల్ కాంప్లెక్స్లో అపస్మారకస్థితిలో వెళ్లిన శ్రీవాత్సవను క్షణాల్లో హాస్పిటల్కు చేర్చారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో అయోధ్యలో ఏర్పాటు చేసిన మొబైల్ హాస్పిటల్లో చికిత్స అందించి భక్తుడి ప్రాణాలు కాపాడారు.
శ్రీవాత్సవకు బీపీ(బ్లడ్ ప్రెజర్) 210170గా నమోదైనట్లు వైద్యులు తెలిపారు. అధిక స్థాయిలో బీపీ పెరగడంతో అతను గుండెపోటుకు గురయ్యాడని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీవాత్సవ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం సివిల్ హాస్పిటల్కు తరలించినట్లు పేర్కొన్నారు.
అయోధ్యకు వచ్చే ప్రముఖులకు, భక్తులు ప్రమాదవశాత్తు అనారోగ్యానికి గురైతే వెంటనే ప్రాథమిక చికిత్స అందించేందుకు అక్కడ మొబైల్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. అన్ని రకాల వైద్య సదుపాయాలతో వాటిని అందుబాటులోకి తెచ్చారు. చాలా మందికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.