ముంబై : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ ఇన్స్పిరేషనల్ పోస్టులను షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రణ్బీర్ కపూర్, అలియా భట్ల బ్రహ్మాస్త మూవీ నుంచి కేసరియ సాంగ్ను ఓ వ్యక్తి ఐదు భాషల్లో ఆలపించిన వీడియోను (Viral Video) మహీంద్ర గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ క్లిప్లో స్నేహదీప్ సింగ్ కల్సి అనే వ్యక్తి కేసరియ సాంగ్ను తెలుగు, కన్నడ, హిందీ, మళయాళం, తమిళ భాషల్లో పాడటం నెటిజన్లను ఆకట్టుకుంది.
Just beautiful. This is what an UNBREAKABLE, united India sounds like… https://t.co/HkKSgrNa2y
— anand mahindra (@anandmahindra) March 17, 2023
తొలుత ఈ పోస్ట్ను సత్బీర్ సింగ్ పోస్ట్ చేయగా 67 ఏండ్ల పారిశ్రామిక దిగ్గజం రీట్వీట్ చేశారు. ఓ పంజాబీ కేసరియ సాంగ్ను హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మళయాళ భాషల్లో పాడారు..నాకు దక్షిణాది భాషలు రాకపోవడంతో ఆయన ఎలా పాడారో తనకు తెలియకపోయినా ఆయన పాడిన తీరు, శబ్ధం అద్భుతమనిపించింది..ఎక్కువ భాషలు నేర్చుకోవడం అందమైన విషయం..ఆయన ఎవరో ఎవరికైనా తెలుసా అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
జస్ట్ బ్యూటిఫుల్, సమైక్య భారత్ అంటే ఇదే అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రనే కాదు ఎంతో మందిని ఆకట్టుకుంది. భావోద్వేగంతో కదిలించారు..ఈ భాషలన్నీ తాను అర్ధం చేసుకోగలనని, ప్రేమ అన్ని భాషలను ఏకం చేస్తుందని, మనం మన హృదయాలను తెరిస్తే చాలని ఓ యూజర్ కామెంట్ చేశారు. గ్రేట్..అద్భుతమైన వాయిస్, స్వరంపై పట్టు అతడి సొంతమని మరో యూజర్ ప్రశంసలు గుప్పించారు.
Read More :