ముంబై : అత్యంత రద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్లో ప్రాణాలకు తెగించి మరీ ఓ వ్యక్తి రైలు ఎక్కేందుకు ప్రయత్నించడం సోషల్ మీడియాలో (Viral Video) హాట్ టాపిక్గా మారింది. ఆఫీసులకు వెళ్లే సమయంలో ముంబైలో లోకల్ ట్రైన్లు ఎంత రద్దీగా ఉంటాయో తెలిసిందే. జనంతో రద్దీగా ఉన్న ట్రైన్లో ఓ వ్యక్తి ఎక్కడం, ఆపై లోపలికి వెళ్లలేక చేసిన ఫీట్లతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
లోకల్ ట్రైన్లో రద్దీ సమయంలో ప్రయాణించాలంటే ప్రాణాలను పణంగా పెట్టాలని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియోను వైరల్ భయాని ఇన్స్టాగ్రాం అకౌంట్లో షేర్ చేయగా ఇప్పటివరకూ పది లక్షలు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో లోకల్ ట్రైన్ కంపార్ట్మెంట్లో జనం కిక్కిరిసి ఉండగా ట్రైన్ డోర్కు వేలాడుతూ ఓ వ్యక్తి ప్రయాణించడం కనిపిస్తుంది. ఇతర ప్రయాణీకులను లోపలికి వెళితే తనకు కొంత స్పేస్ లభిస్తుందని అతడు చేసిన విన్యాసాలు ఫలించకపోవడం ఈ వైరల్ క్లిప్లో చూడొచ్చు.
ఈ వీడియోపై ఆన్లైన్ వేదికగా చర్చ సాగింది. ఈ తరహా ప్రయాణం ఎంతో ప్రమాదకరమని పలువురు కామెంట్ చేశారు. పొట్టకూటి కోసం సకాలంలో తమ కార్యస్ధానాలకు చేరేందుకు సగటు మనిషి ప్రతిరోజూ చేసే పోరాటం ఇదని ఓ యూజర్ కామెంట్ చేయగా, అందరూ క్యాబ్, కారులో వెళ్లే స్ధోమత కలిగిఉండరని మరో యూజర్ రాసుకొచ్చారు. ఈ వీడియో చూస్తే రైలు వెళుతున్నంత వేగంగా నా గుండె కొట్టుకుంటోందని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Janhvi Kapoor: గోల్డెన్ గౌన్లో జాన్వీ జిగేల్.. కిక్కెక్కిస్తున్న కొత్త ఫోటోలు