న్యూఢిల్లీ: జాన్వీ కపూర్(Janhvi Kapoor) జిగేల్మంటోంది. ఉల్జా షూటింగ్ కోసం లండన్లో ఉన్న ఆ క్యూటీ అక్కడ జరిగిన యానిబాల్ బాల్ ఈవెంట్లో పాల్గొన్నది. ఎలిఫెంట్ ఫ్యామిలీ వన్యసంరక్షణ కేంద్రానికి చెందిన 20వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ప్రోగ్రామ్లో జాన్వీ తళుక్కుమన్నది. సెన్షేషన్ లుక్లో ఉన్న ఆ బ్యూటీ ఆ ఈవెంట్కు చెందిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
మేటి డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఆ గోల్డెన్ గౌన్ డిజైన్ చేశారు. మహారాజా లయాన్ మాస్క్ డ్రెస్సుతో జాన్వీ కపూర్ ధగధగ మెరిసిపోతున్నట్లు మనీశ్ మల్హోత్రా రియాక్ట్ అయ్యారు. యానిమల్ బాల్ షోలో సబ్యసాచి ముఖర్జీ, అనితా దోంగ్రే లాంటి ఫేమస్ డిజైనర్లు కూడా తమ వర్క్ను ప్రజెంట్చేశారు. జాన్వీ కొత్త లుక్, అవతార్ను చూసిన మేటి డిజైనర్లు ఆ నటిపై ప్రశంసలు కురిపించారు.