లక్నో : యూపీలోని వారణాసి పిప్లాని కత్రా ప్రాంతంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఈనెల 25న జరిగిన ఓ పెండ్లి వేడుకలో 40 ఏండ్ల వ్యక్తి డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
राजस्थान के पाली में साली की शादी में स्टेज पर डांस करते-करते जीजा की मौत हो गई। जिस घर में शादी की खुशियां मनाई जा रही थीं, वहां मातम पसर गया। मामला महात्मा गांधी कॉलोनी का शुक्रवार रात का है। मृतक 42 साल के अब्दुल सलीम पठान सरकारी स्कूल में PTI (फिजिकल ट्रेनिंग इंस्ट्रक्टर) थे। pic.twitter.com/cDPwzutVM5
— Prasoon Shukla 🇮🇳प्रसून शुक्ला🇮🇳राष्ट्र प्रथम (@prasoon001shukl) November 13, 2022
ఈ వీడియోలో వ్యక్తి ఇతరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం అక్కడున్న వారందరినీ షాక్కు గురిచేసింది. బాధితుడిని మనోజ్ విశ్వకర్మ(40)గా గుర్తించారు. పిప్లాని కత్రాలో ఓ పెండ్లి వేడుకకు వెళ్లిన మనోజ్ అక్కడ డ్యాన్స్ చేస్తూ మురణించారు.
రాజస్ధాన్లోని పాలి జిల్లాలో ఇటీవల మరదలి వివాహ వేడుకలో ఓ వ్యక్తి హుషారుగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. గుండె పోటుతో ఆ వ్యక్తి మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఇక అక్టోబర్ 18న గుజరాత్లోని దహోద్ జిల్లాలో రమేష్ వంజర (51) అనే వ్యక్తి చేతిలో దాండియా ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలారు.