కోల్కతా : బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) కాన్వాయ్లోని కారు ఢీ కొని ఓ వ్యక్తి మరణించిన ఘటన పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. పర్బ మేదినిపూర్ జిల్లాలోని చండీపూర్లో కాషాయ నేత కాన్వాయ్కు చెందిన కారు గురువారం రాత్రి ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ప్రమాదంలో వ్యక్తి తీవ్రగాయాలైనా కారు ఆపకుండా ముందుకు దూసుకుపోయింది.
మొయినాలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సువేందు అధికారి కార్యక్రమం ముగిసిన అనంతరం వెనుదిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు ఢీకొట్టిన సమయంలో బాధితుడు షేర్ ఇస్రఫిల్ రోడ్డు పక్కగా నిలుచుని ఉన్నాడని స్ధానికులు, ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
ఇక ఈ వాహనం నందిగ్రాం ఎమ్మెల్యే సువేందు అధికారి కాన్వాయ్కు చెందినదా కాదా అనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కాగా, ఈ ఘటనపై స్ధానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బీజేపీ నేత సువేందు అధికారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ దాదాపు గంట పాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
Read More