భోపాల్: అదనపు కట్నం కోసం భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ (triple talaq) చెప్పిన భర్తపై పోలీసులు కేసు నమోదుచేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ హాపూర్కు చెందిన మహమ్మద్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కట్నం కోసం తన భార్యను వేదిస్తున్నాడు. అడిగినంత కట్నం ఇవ్వకపోవడంతో సెప్టెంబర్ 21న ఆమెకు ఫోన్లో ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. అయితే అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తింటివారు తనను వేదిస్తున్నారని, ఫోన్లో ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని 32 ఏండ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇప్పటికే తన తండ్రి ఓ అపార్ట్మెంట్ కోనిచ్చాడని, ప్రస్తుతం వారు అందులోని ఉంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నది. అది చాలదన్నట్లు మరో రూ.ఐదు లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నారని, తన పుట్టింటివారు ఆ మొత్తం ఇవ్వకపోడంతో గత నెలలో తనకు ఫోన్లో ట్రిపుల్ తలాఖ్ (triple talaq) చెప్పాడని వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.