UP Polls | బీజేపీ అంటేనే ఒంటి కాలుపై లేచే బెంగాల్ సీఎం మమత బెనర్జీ యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్కు మద్దతుగా యూపీలో ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 8 న లక్నోలో జరిగే వర్చువల్ ర్యాలీలో సీఎం మమత ప్రసంగిచనున్నారు. దీని తర్వాత వారణాసి నియోజకవర్గంలోనూ అఖిలేశ్కు మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్ రంగంలోకి దిగనుంది. ఈ విషయాన్ని సమాజ్వాదీ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నంద ప్రకటించారు.
‘ఫిబ్రవరి 8న సీఎం మమత యూపీ పర్యటనకు వస్తున్నారు. సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్తో భేటీ అవుతారు. వర్చువల్ ర్యాలీలో ప్రసంగిస్తారు. మమత బెనర్జీ మాత్రం యూపీ ఎన్నికల గోదాలోకి దిగడం లేదు. అన్ని సీట్లనూ అఖిలేశ్కే ఇచ్చేశారు’ అని కిరణ్మయి నంద పేర్కొన్నారు.
యూపీ ఎన్నికల సందర్భంగా యూపీలో జరిగే ర్యాలీలో అఖిలేశ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించాలని సీఎం మమత ముందే నిర్ణయించుకున్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే కోవిడ్ కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల కారణంగా ఇవన్నీ రద్దయ్యాయి. వర్చువల్ ర్యాలీలో మాత్రం పాల్గొనాలని సీఎం మమత నిర్ణయించుకున్నారు.