కోల్కతా, సెప్టెంబర్ 1: ఆరెస్సెస్లో ఉన్న వాళ్లంతా చెడ్డ వారు కాదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతు ఇవ్వని చాలామంది ఆరెస్సెస్లో ఉన్నారని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష ఎంఐఎం, కాంగ్రెస్, సీపీఎం నేతలు ఆమెపై మండిపడుతున్నారు.
ఆమెది రాజకీయ అవకాశవాదమని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీకి దగ్గరయ్యేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2003 ఎన్నికల్లో కూడా ఆరెస్సెస్ కార్యకర్తలను మమతా బెనర్జీ దేశ భక్తులని పొగిడారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు.