కోల్కతా, నవంబర్ 25: బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి శుక్రవారం సమావేశమయ్యారు. సువేందు తృణమూల్ను వీడి బీజేపీలో చేరడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో ఇరువురు నేరుగా తలపడిన తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. అసెంబ్లీ సమావేశం విరామం సమయంలో సువేందుకు చాయ్ తాగేందుకు దీదీ ఆహ్వానించారు.
సువేందుతోపాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా సీఎం చాంబర్లోకి వెళ్లారు. సమావేశం అనంతరం సువేందు మాట్లాడుతూ ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. అంతకుమందు అసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవంపై మమత మాట్లాడుతూ.. సువేందు తనకు సోదరుడిలాంటి వాడు అని చెప్పారు. మమత, సువేందు భేటీపై కాంగ్రెస్ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. ‘గురువారం బెంగాల్కు కేంద్రం నిధులు విడుదల చేసింది. వచ్చే నెల 5న మోదీతో దీదీ భేటీ కానున్నారు. నేడు సువేందుతో భేటీ అయ్యారు. ఇవన్నీ చూస్తుంటే మోదీ, దీదీ కలిసిపోయారేమో అనిపిస్తున్నది’ అని పేర్కొన్నది.