Loksabha Elections 2024 : ఆదివాసీల రిజర్వేషన్ను మైనారిటీలకు అప్పగిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని, ఇది ఎప్పటికీ జరగదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మైనారిటీలు ఎన్నటికీ గిరిజనుల కోటాను టచ్ చేయలేరని ఆమె స్పష్టం చేశారు. ఓ ప్రముఖ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల గురించి తాను ఈరోజే విన్నానని ఆమె చెప్పారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో బుధవారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడారు. బీజేపీ నేతలు రిజర్వేషన్పై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసిన అంశంపై దీదీ స్పందించారు.
కొన్ని ఏజెన్సీల ద్వారా కాషాయ నేతలు ఇలాంటి దుశ్చర్యలకు తెగబడతారని, తాను ఈ అభిప్రాయాన్ని అంగీకరించబోనని దీదీ తెలిపారు. ఈ ఉత్తర్వులు ఇచ్చిన వారు వాటిని తమ వద్దే ఉంచుకోవాలని, బీజేపీ అభిప్రాయాన్ని తాము అంగీకరించమని ఆమె స్పష్టం చేశారు. ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందని, ఇది ఎప్పటికీ కొనసాగుతుందని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.కాగా, పశ్చిమ బెంగాల్లో 2010 నుంచి జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది.
Read More :
FSSAI: ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా శ్యాంపిళ్లలో ఇథిలిన్ ఆక్సైడ్ ఆనవాళ్లు లేవు: ఎఫ్ఎస్ఎస్ఏఐ