కోల్కతా : నరేంద్ర మోదీ సర్కార్పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్లిష్ట సమయాల్లో కేంద్రం బెంగాల్కు ఎలాంటి నిధులు పంపలేదని దీదీ దుయ్యబట్టారు. ప్రధాని ఈ విషయంపై దృష్టిసారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పలువురు బీజేపీ నేతలకు భద్రతగా వేలాది కేంద్ర బలగాలని హోంమంత్రి అమిత్ షా పంపారని, అయితే ఆపద సమయంలో మాత్రం కేంద్రం రాష్ట్రానికి నిధుల విషయంలో మొండిచేయి చూపిందని దీదీ మండిపడ్డారు. ఆంఫన్, ఫని, బుల్బుల్, యాస్ తుపాన్ల సమయంలో రాష్ట్రానికి కేంద్రం పైసా నిధులు పంపలేదని, ఈ విషయంపై ప్రధాని ఆలోచించాలని మమతా బెనర్జీ కోరారు.