న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం సమావేశమయ్యారు. బీజేపీయేతర పక్షాలతో సమావేశమయ్యేందుకు ఢిల్లీ చేరుకున్న దీదీ శరద్ పవార్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.
ఇక రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు బుధవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మమతా బెనర్జీ విపక్షాలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుతూ మమతా బెనర్జీ 22 మంది విపక్ష నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలను కూడా ఈ భేటీకి దీదీ ఆహ్వానించారు.
విభజన శక్తులను దీటుగా ఎదుర్కొనే క్రమంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకునేందుకు రాష్ట్రపతి ఎన్నికల సరైన వేదిక అవుతుందని విపక్ష నేతలకు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇక రేపు జరిగే విపక్షాల భేటీకి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్లు హాజరు కానున్నారు. మరోవైపు విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా తాను బరిలో ఉండబోనని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పార్టీ నేతలతో స్పష్టం చేశారని సమాచారం.