కోల్కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీది ద్వంద్వ స్వభావమని విమర్శించారు. ఎన్నికల ముందర ఒక మాట చెప్పి, ఎన్నికలు ముగిశాక మరోటి చేస్తుందని దుయ్యబట్టారు. బుధవారం మేఘాలయలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకే కేంద్రంలోని మోదీ సర్కారు నిధులు అందిస్తున్నదని విమర్శించారు. సుపరిపాలన తృణమూల్తోనే సాధ్యమని, తమ పార్టీని గెలిపించాలని కోరారు.