సుబేదారి,ఆగస్టు 7 : హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్కులో విద్యుత్తు షాక్తో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూపార్క్లోని ఎన్క్లోజర్లో మూడు ఎలుగుబంట్లను ఉ ంచారు. రాత్రి నిద్రించడానికి ఇనుప రాడ్లతో నైట్ షెల్టర్ గదులు నిర్మించారు.
మంగళవారం నైట్ షెల్టర్ గదికి అమర్చిన లైటింగ్ స్విచ్బోర్డు వైర్ తెగడంతో విద్యుత్తు షాక్ తగిలి ఆడ ఎలుగుబంటి మృతి చెందింది. ఎలుగుబంటికి పోస్టుమార్టం చేయించి, పార్కు ఆవరణలో సమాధిచేశారు. విషయం బయటికి రాకుండా జూపార్కు ఇన్చార్జి అధికారి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.