Union Budget | మరికాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారి సెంట్రల్ హాల్లో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం కానున్నారు. రాజ్యసభ సభాపక్షనేత మల్లికార్జున ఖర్గే, పలువురు ఎంపీలు హాజరుకారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కాంగ్రెస్ ఎంపీలు, పలువురు అగ్రనేతలు సోమవారం శ్రీనగర్లో జరిగిన భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం కశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, దాంతో ఖర్గే సహా పలువురు ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగానికి సోనియా గాంధీ హాజరుకానున్నారు.
Due to delayed flights from Srinagar airport on account of inclement weather conditions, Leader of Opposition in the Rajya Sabha, @kharge ji & many other Congress MPs will be unable to attend the President's address to both Houses of Parliament at 11am today.
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 31, 2023