బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) పోలింగ్ జరుగుతుండగా రాష్ట్రంలో సంక్షేమ సర్కార్ కొలువు తీరుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నాటక ప్రజలు ప్రగతిశీల, పారదర్శక, సంక్షేమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు.
మెరుగైన భవిష్యత్ కోసం ప్రజలు ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు పొందిన వారంతా ముందుకొచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ఖర్గే ట్విట్టర్ వేదికగా కోరారు. ఇక కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్ధించారు.
ఇక 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో 2615 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ధేశించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇక మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More