న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా సోమవారం తిరిగి గుర్తించారు. రాజ్యసభకు మరోసారి ఎన్నికైన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరిగి నియమితులయ్యారు. (Mallikarjun Kharge) జూన్ 25తో రాజ్యసభ సభ్యుడిగా మల్లికార్జున ఖర్గే పదవీకాలం ముగిసింది. దీంతో జూన్ 26 నుంచి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆయన కొనసాగలేదు.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో సోమవారం రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గేను మరోసారి గుర్తించారు.
మరోవైపు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. ‘రాజ్యసభకు తిరిగి ఎన్నికైనందున, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం, సంబంధిత నిబంధనల ప్రకారం జూన్ 26 నుంచి అన్ని ప్రయోజనాలు అమలులోకి వచ్చేలా మల్లికార్జున ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభ చైర్మన్ గుర్తించారు’ అని పేర్కొన్నారు.