న్యూఢిల్లీ: లోక్సభకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాలని, ఆ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) డిమండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎటువంటి జాప్యం చేయకుండా ఆ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 16వ లోక్సభ ప్రారంభం అయ్యే వరకు ప్రతి సభలోనూ డిప్యూటీ స్పీకర్ ఉన్నారని, ప్రతిపక్ష పార్టీల నుంచి డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవడం ఆనవాయితీ అని ఆయన ఆ లేఖలో తెలిపారు. కానీ తొలిసారి ఆ పోస్టు రెండు పర్యాయాల నుంచి ఖాళీగా ఉంటోందని ఖర్గే ఆరోపించారు. ఇది భారతీయ ప్రజాస్వామ్యానికి శుభసంకేతం కాదు అని, రాజ్యాంగంలోని హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఖర్గే పేర్కొన్నారు.
Congress President Shri @kharge writes to PM Modi on the urgency to initiate the process of electing a Deputy Speaker of Lok Sabha without any further delay.
Up to the 16th Lok Sabha, every House has had a Deputy Speaker and it has been a well established convention to appoint… pic.twitter.com/6LViziTxok
— Congress (@INCIndia) June 10, 2025