న్యూఢిల్లీ : లోక్సభలో భద్రతా వైఫల్యం అనంతరం రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Malliakrjun Kharge) ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. భద్రతా వైఫల్యంపై తగినంత సమాచారం అందుబాటులో లేదని, ఇది తీవ్రమై అంశం కాగా లోక్సభ వాయిదా వేశారని, రాజ్యసభ కూడా ఇదే బాటన నడుస్తోందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.
లోక్సభ, రాజ్యసభ అనే విషయం ప్రశ్న కాదని, విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నా ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ లోపలికి ఎలా ప్రవేశించారనేదే కీలకమని, భద్రతా వైఫల్యం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్ రియాక్టయ్యారు. రాజ్యసభ పెద్దల సభ అని, అన్నింటికంటే దేశం బలమే గొప్పదని మనం సందేశం పంపాలని అన్నారు. సభా కార్యకలాపాలు కొనసాగుతాయని, ఈ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయడం దేశానికి సరైన సంకేతం పంపదని వ్యాఖ్యానించారు.
ఇక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరిట విడుదల చేసిన విజిటర్ పాస్తో లోక్సభలోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు బెంచీలపై నుంచి దూకుతూ కలర్ స్మోక్ను వదిలి ఎంపీలను భయభ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ప్రాంగణంలో ఎల్లో స్మోక్ను వదిలి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.
Read More :
Watch: పేలిన ప్రెజర్ కుక్కర్.. తర్వాత ఏం జరిగిందంటే?