పాట్నా, ఫిబ్రవరి 2: పరీక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన ఓ బాలుడు.. ఒకేసారి 500 మంది బాలికలను చూసి భయంతో సొమ్మసిల్లి కింద పడిపోయాడు. జ్వరంలో గజగజ వణికిపోయాడు. బీహార్కు చెందిన 17 ఏండ్ల మనీశ్ శంకర్ ప్రసాద్ 12వ తరగతి చదువుతున్నాడు.
నలంద జిల్లా సుందర్గఢ్లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్లో బుధవారం గణితం పరీక్ష రాయడానికి వెళ్లాడు. పరీక్ష హాలులో అందరూ అమ్మాయిలే ఉన్నారు. దీంతో కంగారుపడి సొమ్మ సిల్లి కిందపడిపోయాడు.