Road Accident | ఉత్తరాఖండ్లోని తెహ్రీలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఉత్తరకాశి జిల్లా మోరీ ప్రాంతం నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న కారు తెహ్రీలోని నైన్బాగ్ యమునా వంతెన సమీపంలోని కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని నైన్బాగ్ తహసీల్దార్ రాజేంద్ర ప్రసాద్ మామంగై ధ్రువీకరించారు.
మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు వ్యక్తులు ఉండగా.. అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడగా చికిత్స నిమిత్తం డెహ్రాడూన్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.