కోల్కతా: లోక్సభలో ప్రశ్నలు అడిగించేందుకు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఎంపీ మహువా మొయిత్రాకు టీఎంసీ గట్టి మద్దతుగా నిలిచింది. పశ్చిమ బెంగాల్లోని కృష్ణా నగర్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ఆమెకు అప్పగించింది.
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం రాష్ట్రంలోని 35 ఆర్గనైజేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రెసిడెంట్ల పేర్లను సోమవారం ప్రకటించింది. మహువా గతంలో ఈ జిల్లా అధ్యక్ష పదవిని కొంత కాలం నిర్వహించారు. తాజాగా ఆమెను ఆ పదవిలో పునరుద్ధరించారు. దీంతో ఆమె పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి, టీఎంసీకి ధన్యవాదాలు తెలిపారు. మహువాను లోక్సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ ఇటీవల సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.