వనపర్తి, జూన్ 21 : అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను సోమవారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అందజేశారు. పట్టణానికి చెందిన హన్మంతుకు రూ 60వేలు, నందినికి రూ 10వేలు, బుద్దారంకు చెందిన వికాస్కు రూ 21,500, ఏదుట్లకు చెందిన రాజుకు రూ 50వేలు, జగత్పల్లి చెందిన మోహన్కుమార్కు రూ 15వేలు, బలిజపల్లికు చెందిన సుమన్కు రూ .12,500, శ్రీరంగాపూర్కు చెందిన సర్దార్కు రూ. 30,500, పెద్దమందడికి చెందిన రామాంజనేయులుకు రూ .60వేలు, నాగమ్మతండాకు చెందిన విజయశాంతికు రూ. 20వేలు, విలువ గల చెక్కులను బాధితులకు మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు చీర్ల సత్యం, నాగన్నయాదవ్, జంపన్న, కృష్ణయ్య, కాగితాల లక్ష్మీనారాయణ, బండారు కృష్ణ, మాజీ కౌన్సిలర్లు తిరుమల్, ఆవుల రమేశ్ నాయకులు ఉన్నారు.