పుణే: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ను అహిల్యానగర్గా మార్చాలంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండేను కోరతానని ఆయన పేర్కొన్నారు. అహిల్యాబాయి ఎన్నో దేవాలయాలు నిర్మించారని తెలిపారు. ఆమె లేకపోతే కాశీ ఉండేది కాదన్నారు. ఆమె లేకపోతే శివాలయాలు ఉండేవి కాదని పేర్కొన్నారు. అందుకే అహ్మద్నగర్ను అహిల్యానగర్గా మార్చాలని కోరుతున్నానని చెప్పారు.