కొత్త సాగు చట్టాలను అమలు చేయం : మహారాష్ర్ట స్పీకర్

ముంబై : మహారాష్ర్టలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త సాగు చట్టాలను అమలు చేయమని ఆ రాష్ర్ట అసెంబ్లీ స్పీకర్ నానా పటోల్ స్పష్టం చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ర్ట రాజధాని ముంబైలో అన్నదాతలు నిరసన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో అత్యధికంగా నాసిక్ జిల్లాకు చెందిన రైతులే ఉన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడారు. కొత్త సాగు చట్టాలపై రాష్ర్ట ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి సమీక్షిస్తుందని తెలిపారు. అయితే రాష్ర్టంలో ఈ చట్టాలను అమలు చేయమని స్పష్టం చేశారు. తాను కూడా రైతునే కాబట్టి అన్నదాతల నిరసనకు తప్పకుండా మద్దతు తెలియజేస్తానని స్పీకర్ పేర్కొన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ర్ట కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాలసాహెబ్ థోరత్ కూడా రైతుల నిరసనకు మద్దతు ప్రకటించారు. రైతులు తమ సమస్యలపై మెమోరాండం ఇచ్చేందుకు సమయం కోరితే గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఇవ్వలేదని శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా రనౌత్కు సమయం ఇచ్చిన గవర్నర్ రైతులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ రెండు విషయాలను స్పీకర్ కూడా ప్రస్తావిస్తూ గవర్నర్ తీరును తప్పుబట్టారు.
తాజావార్తలు
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
- డ్రాగన్తో వాణిజ్యం కొనసాగించాల్సిందే: రాజీవ్ బజాజ్ కుండబద్ధలు
- పదవీ విరమణ పొందిన అధికారులకు సీఎస్ సన్మానం
- పాల సేకరణ ధరలు పెంచిన కరీంనగర్ డెయిరీ
- దత్తత కుమారుడి పెండ్లికి హాజరైన రాజ్నాథ్ సింగ్
- శ్రీవారి ఆలయంలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ