ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 48,700 కరోనా కేసులు, 524 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43,43,727కు, మొత్తం మరణాల సంఖ్య 65,284కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 71,736 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 36,01,796కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,74,770 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతున్నది.