ముంబై: మహారాష్ట్రలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. వరుసగా మూడో రోజు కూడా 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 44,388 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క ముంబైలోనే కొత్తగా 19, 474 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబైలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,17,434కు చేరగా, రాష్ట్రం మొత్తంగా ఈ సంఖ్య 2,02,259కు పెరిగింది.
మరోవైపు మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. ఆదివారం కొత్తగా 207 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,216కు పెరిగింది. కాగా, గత 24 గంటల్లో 12 మంది కరోనా రోగులు చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,41,639కు చేరినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.