ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం కొత్తగా 10,989 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,63,880కు పెరిగింది. 24 గంటల్లో కొవిడ్తో మరో 261 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,01,833కు చేరింది. గత రెండు రోజులుగా సరాసరిగా 10వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మార్చి 9న మహారాష్ట్రలో 9,927 కేసులు నమోదు కాగా ఆ తర్వాత వైరస్ విజృంభించడంతో కేసులు గణనీయంగా పెరిగాయి. బుధవారం మరో 16,379 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 95.45శాతంగా ఉంది. మరణాల రేటు 1.74గా ఉంది.