ముంబై : మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో 25,425 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,87,397కు పెరిగింది. ఒకే రోజు 42 మరణాలు నమోదవగా.. మొత్తం సంఖ్య 1,42,358కి చేరుకుంది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 76,30,606కు చేరింది. 24 గంటల్లో 36,708 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 71,97,001 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.32శాతం, మరణాల రేటు 1.86శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వివరించింది. ప్రస్తుతం 15,31,108 మంది హోం క్వారంటైన్లో ఉండగా, 3,259 మంది ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 72 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 2,930కు చేరింది.