BRS Party | భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు శంకరన్న ధోంగే నేతృత్వంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు సోమవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్లో చేరినవారిలో ఎన్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ సలుంఖే, మాజీ ఎమ్మెల్యే సంగీత వీ థోంబరే భర్త విజయ్ థోంబరే, ముఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నానాసాహెబ్ జాదవ్, జడ్పీ మెంబర్ శివ మొహోద్, మాజీ సభాపతి సుశీల్ ఘోటె, మాజీ జడ్పీ మెంబర్ దేవానంద్ మూలె, నాందేడ్ కార్పోరేటర్ శ్రీనివాస్ జాదవ్, శివ్ సంగ్రామ్ పార్టీ నుంచి కచ్రే సహేద్, ఎ బీడ్ నుంచి అమర్ షిండే, పీఎంసీ మొతాలా జిల్లా బుల్దానా ప్రెసిడెంట్ పార్టీలో చేరారు.
శివ్ సంగ్రామ్ పార్టీ ప్రెసిడెంట్ పంజాబ్ రావ్ దేశ్ ముఖ్, శివ్ సంగ్రామ్ పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ శైలేష్ సర్కేట్, ఎంఎన్ఎస్ లాతూర్ జిల్లా ప్రెసిడెంట్ ద్నీనేశ్వర్ జగ్డేల్, బీడ్ జిల్లా శివ్ సంగ్రామ్ పార్టీ జనరల్ సెక్రెటరీ సునీల్ అర్సుల్, శివ్ సంగ్రామ్ స్టూడెంట్ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కమలాకర్ థోరట్, బీడ్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ షిండే, లాతూర్ జిల్లా తాలూకా ఎన్సీపీ ప్రెసిడెంట్ ఆదిత్య దేశ్ముఖ్ ఉన్నారు.
బీడ్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సోమవంశీ, లాతూర్ జడ్పీ మెంబర్ వ్యంకట్రావ్ జాదవ్, ధరూర్ జిల్లా బీడ్ తాలూకా బీజేపీ ప్రెసిడెంట్ మహేశ్ సోలంకె, బీడ్ జిల్లా అంబజోగయ్ తాలూకా భావ్ థానా సర్పంచ్ శివ్ లింగ్ యాదవ్, సామాజిక కార్యకర్తలు ఇంద్రజిత్ మోరే, ధనంజయ్ మసాల్, సిద్ధేశ్వర్ థోనగే పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ ధోంగే తదితరులు పాల్గొన్నారు.