అనిల్ దేశ్ముఖ్పై సీబీఐ దర్యాప్తు
కొత్త హోంమంత్రిగా దిలీప్ వాల్సే
ముంబై, ఏప్రిల్ 5: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు. రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సమర్పించారు. అంతకుముందు ఆయన తమ పార్టీ నేత, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను కలిశారు. అనిల్ దేశ్ముఖ్ రాజీనామాతో హోంమంత్రి పదవిని శరద్పవార్కు నమ్మకస్తుడు, ఎన్సీపీ నేత దిలీప్ వాల్సేకు కేటాయించారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలంటూ అనిల్ దేశ్ముఖ్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పరమ్బీర్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోసం బాంబే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లపై కోర్టు ఇటీవల విచారణ జరిపి సోమవారం తీర్పునిచ్చింది. హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలు అసాధారణమైనవని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిటైర్డ్ జడ్జి చేత దర్యాప్తునకు ఆదేశించినా సీబీఐ దర్యాప్తు తప్పనిసరని అభిప్రాయపడింది. 15 రోజుల్లోగా ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది.
మరిన్ని వార్తలు చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట