ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్.. కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సీనియర్ నేత త్వరలో బీజేపీలో చేరనున్నట్లు కొన్ని వర్గాలు వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఈమధ్యే మాజీ కేంద్ర మంత్రి మిలింద్ డియోరా ఆ పార్టీని వదిలేశారు. ఆయన శివసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు ఎమ్మెల్యే అశోక్ చౌహాన్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ పనితీరుపై చౌహాన్ అసంతృప్తితో ఉన్నారు.