ముంబై: అనారోగ్యంతో ఉన్న భార్యను ఒక వృద్ధుడు తన భుజంపై మోశాడు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె చనిపోయింది. మహారాష్ట్రలోని నందుర్బార్లో బుధవారం ఈ విషాదకర ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రహదారి మూసుకుపోయింది. దీంతో అంబులెన్స్ చిక్కుకుని రాలేకపోయింది. చేసేదేమీ లేక పరిస్థితి సీరియస్గా ఉన్న భార్యను వృద్ధుడు తన భుజాలపై మోశాడు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆమె చనిపోయింది.
కాగా, భారీ వర్షాలకు కొండచరియలు విరిగిన కారణంగా అంబులెన్స్ చిక్కుకోవడంతో ఆ వృద్ధురాలిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారని, దీంతో ఆమె మరణించినట్లు అధికారులు తెలిపారు.