నాగ్పూర్: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వివాదంలో చిక్కుకున్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది. ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా షిండే పని చేశారు.
ఈ సమయంలో నాగ్పూర్లో మురికివాడల ప్రజలకు ఇండ్లు నిర్మించేందుకు కేటాయించిన నాలుగున్నర ఎకరాల స్థలాన్ని 16 మంది ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. ఈ భూకేటాయింపులపై తాజాగా బాంబే హైకోర్టు స్టే ఇవ్వడంతో వివాదం మొదలైంది. రూ.83 కోట్ల విలువైన ఈ స్థలాన్ని కేవలం రూ.1.5 కోట్లకే కట్టబెట్టారని, ఈ నిర్ణయం వెనుక షిండే ఒత్తిడే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.