ముంబై, ఆగస్టు 10: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వ్ కుమారుడు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. గ్లోబల్ మ్యూజిక్ జంక్షన్ సంస్థ సీఈవో రాజ్కుమార్ సింగ్ను ఎమ్మెల్యే కుమారుడు తన అనుచరులతో కలిసి ఎత్తుకెళ్లాడు.
తుపాకీతో బెదిరించి కారులో నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకెళ్లాడు. రూ.8.5 కోట్ల విలువైన ఓలోన్ కాంట్రాక్టు పేపర్లపై సంతకాలు చేయాలంటూ ఒత్తిడి చేశాడు. రాజ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.