ముంబై : ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కేందుకు కాషాయ నేతలు సంసిద్ధమయ్యారు. ఓట్లు రాబట్టేందుకు ఎన్ని కుయుక్తులకైనా తెరలేపేందుకు కమలనాధులు కసరత్తు సాగిస్తున్నారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవన్కులే కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ బరితెగింపును బట్టబయలు చేశాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర సర్కార్పై, బీజేపీపై ఎలాంటి ప్రతికూల వార్తలు రాకుండా జర్నలిస్టులను మచ్చిక చేసుకోవాలని ఆయన కార్యకర్తలతో చెప్పుకొచ్చారు.
అహ్మద్నగర్లో బ్లాక్ కమిటీ కార్యకర్తలతో చంద్రశేఖర్ భవన్కులే మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసి రాద్ధాంతం సృష్టించే జర్నలిస్టుల జాబితాను తయారుచేసి వారి కదలికలను, రిపోర్ట్స్ను పసిగట్టాలని కోరారు. జర్నలిస్టుల నుంచి కేవలం పాజిటివ్ వార్తలే వచ్చేవిధంగా చూసుకోవాలని పార్టీ కార్యకర్తలకు ఆయన హితబోధ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్గా మారింది.
మనకు ప్రతికూలంగా వార్తలు రాసే జర్నలిస్టుల జాబితాను రూపొందించి వారికి తరచూ టీ ఆఫర్ చేయాలని, వారిని దాబాలకు తీసుకువెళ్లి బాగా చూసుకోవాలని, మన గురించి ప్రతికూల వార్తలు రాకుండా మేనేజ్ చేయాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న ఘనకార్యాలను జర్నలిస్టులు హైలైట్ చేయడం లేదని వాపోయారు. చంద్రశేఖర్ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. జర్నలిస్టులను బీజేపీ బెదిరిస్తోందని కాంగ్రెస్ నేత విజయ్ వడెటివార్ దుయ్యబట్టారు.
Read More :
Udhayanidhi Stalin | ఉదయనిధి స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యలు : హిందూ మున్నాని నేత అరెస్ట్