Ajit Pawar | మహారాష్ట్ర రాజకీయ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పార్టీలపై నేతల తిరుగుబాటుతో సంచలనంగా మారిన మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలే చోటు చేసుకోబోతున్నాయి. ఇందుకు ఉదాహారణ ఎన్సీపీ ఎమ్మెల్యే చేసిన ట్వీట్. ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ చేసిన ఓ ట్వీట్ చేశారు. ఇందులో అజిత్ పవార్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దతుదారుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. కొన్ని హోర్డింగ్ల్లో అజిత్ పవార్ను మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. ఎమ్మెల్యే ట్విట్టర్లో ‘నేను అజిత్ అనంతరావు పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణం చేబోతున్నాను’ అంటూ ఫొటోను జత చేస్తూ ట్వీట్ చేశారు.
మరో వైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. అయితే, ప్రధానితో భేటీ అనంతరం ఆయన రాయగడ ఘటన, వర్షాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. అయితే, సీఎం మార్పుపై సైతం చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో శివసేన (షిండేవర్గం), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత.. ఎన్నికల్లో సంకీర్ణ కూటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో శివసేన ఓటు బ్యాంకును షిండే తన వైపు తిప్పుకోలేకపోతున్నారని బీజేపీ భావిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మహా వికా అఘాదీని ఎదుర్కొనేందుకు అజిత్ పవారే సరైన వ్యక్తని భావిస్తోందని, ఈ క్రమంలోనే పవార్ బీజేపీతో కలిసి ప్రభుత్వంలో చేరారు. త్వరలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతున్నది.
मी अजित अनंतराव पवार महाराष्ट्राचा मुख्यमंत्री म्हणून शपथ घेतो की……! लवकरच #अजितपर्व pic.twitter.com/12jZ8BMPRi
— आ. अमोल रामकृष्ण मिटकरी (@amolmitkari22) July 21, 2023