ముంబై : మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. నవాబ్ మాలిక్కు వై ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పైలట్ కారుతో పాటు 8 మంది గన్మెన్లను కేటాయించింది. నలుగురు గన్మెన్లు మంత్రి వెంట, మరో నలుగురు ఇంటి వద్ద భద్రతలో ఉండనున్నారు.
గత వారం నవాబ్ మాలిక్కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రతను పెంచారు.