Maharashtra | థాణె, నవంబర్ 18: మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విచిత్ర ఆలోచన చేసింది. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం దీన్ని వదిలేసి తెరపైకి రెజ్యూమ్ ఆలోచనను తీసుకొచ్చింది. యువతకు నాణ్యత గల రెజ్యూమ్లను అందజేయాలనుకుంటున్నది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్కు హాయ్ అని మెసేజ్ చేసి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినవారికి డిజిటల్ రెజ్యూమ్ వచ్చేస్తుంది. ఈ ఆలోచనపై ప్రభుత్వం పెద్దలు స్పందిస్తూ సరైన రెజ్యూమ్ లేకపోవడంతో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకోలేకపోతున్నారని చెప్పారు. అందుకే ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇందులో కృత్రిమ మేధను ఉపయోగిస్తామన్నారు.