MP Sanjay Singh | న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ను ఇరికించేందుకు బీజేపీ నాయకత్వం కుట్రలు చేసిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. బెయిల్పై విడుదలైన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులతో బీజేపీ క్విడ్ ప్రోకోకు పాల్పడిందని అన్నారు. అందులో భాగంగానే ఏపీలోని ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి బీజేపీ మిత్రపక్షం టీడీపీ నుంచి లోక్సభ టికెట్ వచ్చిందని ఆరోపించారు.
కేంద్ర ఎన్నికల సంఘం తనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత ఆతిశీ మండిపడ్డారు. ఈడీ ఏమైనా అధికార పార్టీ బీజేపీ అనుబంధ సంస్థా? అని ప్రశ్నించారు. తనను బీజేపీలో చేరాలని లేదా ఈడీ చేతిలో అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆ పార్టీ నేతలు తనను బెదిరించారని అతిశీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం గురువారం నోటీసులు ఇచ్చింది.